సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలనే ఒత్తిడిని అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తున్నదని వాపోతున్నది బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి. తాము నాయికల కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయామని ఆమె అంటున్నది.
ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హ్యూమా మాట్లాడుతూ…‘విదేశాల్లో నాయికలు కేవలం నటనకే పరిమితమవుతారు. కానీ మన బాలీవుడ్ తారలు నటీమణుల్లా కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లా మారిపోతున్నారు. నేనూ దీనికి మినహాయింపు కాదు. మా సోషల్ మీడియా అక్కౌంట్స్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత డిమాండ్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. వాస్తవానికి మా పని నటించడం, నెటిజన్లను ఆకర్షించడం కాదు కదా.’ అని చెప్పింది.