నవీన్చంద్ర, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. యశ్వంత్ ములుకుట్ల నిర్మాత. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ను యువహీరో సాయిధరమ్తేజ్ ఆవిష్కరించారు.
ఈ సినిమాకు మంచి కథతో పాటు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగా కుదిరాయని, ఓ జంట ప్రయాణానికి అద్దం పడుతూ హృదయాన్ని కదిలిస్తుందని హీరో నవీన్చంద్ర చెప్పారు. ఈ సినిమాలోని ఎమోషన్స్తో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని స్వాతి రెడ్డి చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.