Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా.. షారుక్ ఖాన్కు ఉన్న క్రేజే వేరు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ నటుల్లో షారుక్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘పఠాన్’ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2018ఏడాదిలో జీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించి షారుక్.. తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత షారుక్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘పఠాన్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రంలో షారుక్ పారితోషకం గురించి ప్రస్తుతం బీటౌన్లో చర్చ నడుస్తోంది.
పఠాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందించారు. సుమారు రూ.250 కోట్లతో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రానికి గానూ షారుక్ పారితోషకం కింద రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాలోని విలన్గా నటిస్తున్న జాన్ అబ్రహం రూ.20 కోట్లు, దీపిక పదుకొణె రూ.15 కోట్లు తీసుకున్నట్లు సంబంధిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.