శనివారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్లో సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజా ఎపిసోడ్లో నాగార్జున హౌజ్మేట్స్తో ఎమోజీ గేమ్ ఆడించాడు. పంచ్, షటప్, కోపం ఎమోజీలతో ఉండే మూడు దిండ్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గేమ్లో శ్రీరామ్.. సన్నీకి పంచ్ ఇవ్వగా కాజల్కు నోరు మూయమనే ఎమోజీ ఇచ్చాడు. ప్రియాంక వల్ల నడవలేకపోతున్నానని ఆమె మీద చిరు కోపాన్ని ప్రదర్శించాడు.
ఇక సన్నీ వంతు రాగా, ఆయన కాజల్కు నోరు మూసే ఎమోజీ ఇచ్చాడు. సిరి మీద కోపంగా ఉందన్నాడు. షణ్నుకు పంచ్ ఇస్తూ అతడు నవ్వితే బాగుంటుందన్నాడు. షణ్ను.. కాజల్ మీద కోపంగా ఉందన్నాడు. సిరి తల మీద ఒక్క పంచ్ ఇస్తే ఆమె బ్రెయిన్ సరిగా పని చేస్తుందన్నాడు. ఉచిత సలహాలు ఇవ్వకుండా నోరు మూసుకోమని ప్రియాంకకు సూచించాడు. తర్వాత ప్రియాంక వంతు రాగా ఆమె సిరికి పంచ్ ఇచ్చింది.
సన్నీ మీద కోపంగా ఉందని పేర్కొంది. కోపంలో నన్ను ఏదైనా అనేస్తాడంటూ మానస్ను కాస్త నోరు మూసుకోమని చెప్పింది. మానస్.. సిరి మీద కోపంగా ఉందంటూ సన్నీకి పంచ్ ఇచ్చాడు. మాట్లాడటం కొంచెం తగ్గించుకుంటే మంచిదని పింకీకి సలహా ఇచ్చాడు. కాజల్.. శ్రీరామ్కు పంచ్ ఇవ్వగా షణ్ను మీద కోపంగా ఉందని తెలిపింది. నేను చెప్తున్నప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని వినాలని సన్నీకి సెలవిచ్చింది. సిరి.. ఇంకోసారి నిన్నే టార్గెట్ చేశానంటే కొడతానని, ఆ మాట మాట్లాడద్దంటూ సన్నీని నోరు మూసుకోమని వార్నింగ్ ఇచ్చింది. షణ్నుకు పంచ్ ఇచ్చింది. ప్రియాంక సింగ్ మీద కోపంగా ఉందని పేర్కొంది.
చివరిగా హౌజ్మేట్స్ త్యాగాలు చేసిన వస్తువులని తెప్పించిన నాగార్జున సిరి, ప్రియాంకకి మాత్రం ఇవ్వలేదు. వీళ్లిద్దరి వస్తువులు కూడా తిరిగి రావాలంటే మిగతా హౌస్మేట్స్ త్యాగం చేయాలని మెలిక పెట్టాడు నాగ్. హౌస్లో ఎవరు ఉండటానికి అర్హత ఉందనుకుంటున్నారో వారికే త్యాగం చేయాలన్నాడు. అందులో భాగంగా తులాభారంలో తమ పర్సనల్ వస్తువులు వేయాలని అన్నాడు.సిరికి ఎక్కువ వస్తువులు లేయడంతో ఆమెకు శ్రీహాన్ ఇచ్చి గిఫ్ట్ దక్కింది.