బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ముందు హిందీ సాంగ్తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందు రోజు జరిగిన హంగామా చూపించారు. సిరి.. టికెట్ టు ఫినాలే నేను గెలవాల్సింది.. నేను గెలిస్తే నాకు ఏ సాంగ్ వేసేవారో అని శ్రీరామ్తో ముచ్చట్లు పెట్టింది. ఆ తరువాత సన్నీ, కాజల్, మానస్, ప్రియాంకలు ముచ్చటించుకుంటూ.. ‘నీకు బిగ్ బాస్ వరం ఇస్తే ఏం అడుగుతావ్’ అని పింకీని అడిగాడు సన్నీ
నాకు వరం ఇస్తానంటే విన్నర్ని కావాలని అడగుతా, అది కాకుండా ఇంకేమి అడుగుతావ్, అని అడగగా, ఆమె ఆలోచిస్తుండగా, ఆలోచించుకో ఆశాభంగం అని సన్నీ అనగా, ‘సర్లే మానస్ విన్నర్ అవ్వాలని కోరుకుంటా అని చెప్పింది. ‘మాటి మాటికీ విన్నర్ దగ్గరకు ఎందుకు పోతావ్.. విన్నింగ్ తప్ప ఇంకేం ఉండవు’ అని చెప్పింది ప్రియాంక. దీంతో అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.. అంటూ నరసింహ సినిమాలోని రజనీకాంత్ డైలాగ్ వేశాడు సన్నీ.
ఇక హౌజ్మేట్స్ చేత ఓ ర్యాంపక్ వాక్ చేయించాడు బిగ్ బాస్. దీనికి శ్రీరామ్, సిరి జడ్జిలుగా వ్యవహరించారు. వీరు కాజల్, షణ్నును విజేతలుగా ప్రకటించారు. అనంతరం వాహ్ తాజ్ యాడ్ ప్రమోషన్లో భాగంగా హౌజ్మేట్స్ బిగ్ బాస్ లోకి వచ్చాక ఏమేం నేర్చుకున్నారు అనే విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎంత అనుకున్నా తర్వాత వెంటనే కలిసిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుందని శ్రీరామ్ అన్నాడు. ఇది బిగ్ బాస్ హౌజ్కి వచ్చాక నేర్చుకున్నా అని చెప్పాడు.