Hombale Films | కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసింది కాంతార (kantara). కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల పంట పండించింది.
కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఇప్పటికే ఓ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ న్యూస్పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. మూవీ లవర్స్, దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ (HombaleFilms) కాంతారావు రెండో పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రకృతితో మన అనుబంధాన్ని ప్రతిబింబించే ఆకర్షణీయమైన కథనం కోసం రెడీగా ఉండండి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి.. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అంజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్గా నిలిచింది. సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. మరి సీక్వెల్ పార్టులో భాగం అయ్యే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులెవరనే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
ಬರವಣಿಗೆಯ ಆದಿ…
On this auspicious occasion of Ugadi & New Year, we are delighted to announce that the writing for the second part of #Kantara has begun. We can't wait to bring you another captivating story that showcases our relationship with nature. Stay tuned for more updates. pic.twitter.com/JPmtE5vtx2— Hombale Films (@hombalefilms) March 22, 2023