Tollywood | ఇండియన్ సినిమాల స్థాయి ఏ రేంజ్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన సినిమాలని ఒకప్పుడు పెద్దగా పట్టించుకోని బాలీవుడ్, హాలీవుడ్ ఇప్పుడు తెలుగు చిత్రాల అప్డేట్స్పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. అంతేకాదు మన సినిమాలు హిట్ అయితే వాటిపై క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప వంటి చిత్రాలు ఇండియా సినిమా స్థాయిని పెంచాయి. ఇక త్వరలో రానున్న మరి కొన్ని సినిమాలతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. మరి కొద్ది రోజులలో క్రేజీ పాన్ ఇండియా మూవీస్ డ్రాగన్, స్పిరిట్, పెద్ది చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాయి.
ఈ మూడు సినిమాలు దేనికదే ప్రత్యేకమైనవి కాగా, ఈ సినిమాల కోసం తొలిసారి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు కలిసి పని చేస్తున్నారు. పెద్ది చిత్రం విషయానికి వస్తే ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు.. రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదల కాగా, ఇది ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మరొక చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా స్పిరిట్.
భారీ బడ్జట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2027లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. యానిమల్ తరువాత సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు పీక్స్లో ఉన్నాయి. ఇక గత కొన్నేళ్లుగా వరుస హిట్స్తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఈ సారి ప్రశాంత్ నీల్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్ అనే చిత్రం చేయబోతున్నాడు.. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా, ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూడు సినిమాలపై అంచనాలు పీక్స్లో ఉండగా, ఈ చిత్రాలు రికార్డు స్థాయి వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.