విశాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లాఠీ’. సునైనా నాయికగా నటిస్తున్నది. రానా ప్రొడక్షన్స్లో రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఏ. వినోద్ మాట్లాడుతూ..‘అక్రమార్కులకు లాఠీ దెబ్బ సమాధానం చెబుతుంది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది. అందుకే అన్ని భాషలకూ ఒకే టైటిల్ పెట్టాం. యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రమిది. ద్వితీయార్థంలో వచ్చే 45 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్, సంగీతం : సామ్ సీఎస్.