కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని దుళ్లగుట్టలో వెలిసిన బాల ఉగ్రనరసింహస్వామిని సినీ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన భార్య ఊహ, కుమారుడు రోహన్తో కలిసి వచ్చి స్వామివారికి పూజలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎర్రవరం ఆలయం అతి తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసం పొందిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.