వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. రక్షితతో ఆయన వివాహం జూన్ 3వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. అక్కడి లీలా ప్యాలెస్లో వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు ఈ పెండ్లి సందడిలో పాల్గొనబోతున్నారు.
రెండు రోజుల పాటు పెండ్లి కార్యక్రమాలు జరపనున్నారు. జూన్ 2న మెహందీ ఫంక్షన్, మరుసటి రోజు రాత్రి 11 గంటలకు కళ్యాణానికి సుముహూర్తంగా నిర్ణయించారు. ఈ జనవరిలో శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది. పలు విజయవంతమైన చిత్రాలతో శర్వానంద్ హీరోగా పేరు తెచ్చుకోగా…రక్షిత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నది.