కథానాయకుడు రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతలకు స్క్రిప్ట్ను అందజేయగా, నిర్మాత సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ ఈ చిత్ర దర్శకురాలు గౌరీ రోణంకి తొలిసినిమా పెళ్లిసందడికి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తాం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.