వరుణ్సందేశ్, డాలీషా జంటగా నటిస్తున్న చిత్రం ‘డైమండ్ రాజు’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. క్రాంతిప్రభాత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఆకాశమే నువ్వని’ అనే గీతాన్ని యువ హీరో నిఖిల్ ఆవిష్కరించారు. అచ్చు రాజమణి స్వరాల్ని అందించిన ఈ పాటను సిధ్శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. వరుణ్సందేశ్ మాట్లాడుతూ ‘సిధ్శ్రీరామ్కు నేను పెద్ద అభిమానిని. నా సినిమాలో ఆయన పాట పాడటం ఆనందంగా ఉంది. చక్కటి కామెడీ కథాంశమిది. ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉంటుంది’ అని చెప్పారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. నందినిరాయ్, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి.