అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై సినీ హీరో నాని ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. టికెట్ ధరల తగ్గింపుతో ప్రేక్షకుడిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లో శ్యాం సింగరాయ్ చిత్రబృందంతో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు (శుక్రవారం) సినిమా రిలీజ్ ఉందని ఏమి మాట్లాడినా వివాదం అవుతుందని అంటూనే ఏపీ నిర్ణయంపై ఆచితూచి మాట్లాడారు.
పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పెద్ద సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి వస్తున్న కలెక్షన్లు ఎక్కువగా ఉంటే బాధపడేది థియేటర్ల యజమానులే అని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ, రాజకీయాలను పక్కన పెడితే టికెట్ల ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమాన పరచవద్దని సూచించారు. నాపేరు ముందు నేచురల్ స్టార్ తీసేయలను కుంటున్నానని నాని తెలిపారు.