‘క్రైమ్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఎలాంటి క్లూస్ లేని ఓ కేసుని ఎలా పరిష్కరించారు అనేది కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి థ్రిల్లర్ని చూసుండరు’ అని హీరో కార్తీక్రాజు అన్నారు. ఆయన కథానాయకుడిగా సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలుగా మహేశ్రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మించిన చిత్రం ‘అథర్వ’. డిసెంబర్ 1న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తీక్ రాజు విలేకరులతో ముచ్చటించారు. ‘కథే ఈ చిత్రానికి బలం. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. పోలీస్ కావడం ఇందులో నా డ్రీమ్. కానీ ఆస్తమా కారణంగా కాలేకపోతాను. అందుకే క్లూస్ టీమ్లో జాయిన్ అవుతాను. ఓ విధంగా ఛాలెంజింగ్ రోల్ అనమాట.’ అని కార్తీక్ చెప్పారు. హీరోయిన్స్ పాత్రలకు కూడా కథలో ప్రాధాన్యత ఉంటుందని, ఈ సినిమాను క్లూస్ టీమ్కు ప్రత్యేకంగా ప్రదర్శిస్తే, సినిమా చూసి వారెంతో అభినందించారని ఆయన తెలిపారు. డిసెంబర్ 7 నుంచి తన కొత్త సినిమా మొదలుకానున్నదని, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా ఇప్పటికే పూర్తి చేశానని కార్తీక్ రాజు చెప్పారు.