Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టీజర్ విడుదల చేయగా.. సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా విజయవాడ (Vijayawada) వెళ్లిన గోపీచంద్ కనకదుర్గ అమ్మవారిని (Kankadurga ammavaru) దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్కి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్కు స్వాగతం పలికారు.
Hero @YoursGopichand visited Goddess Kanaka Durga Temple in Vijayawada and took the divine blessings ✨🙏
He will be visiting the RVR & JC College of Engg, Guntur at 10:30 AM ❤️🔥#BHIMAA IN CINEMAS MARCH 8th💥#BHIMAAonMARCH8th@NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma… pic.twitter.com/NNNUwPySux
— BA Raju’s Team (@baraju_SuperHit) February 17, 2024