అభినవ్, సత్యమణి, ప్రియాంక, చందనకృష్ణ, వశిష్ట్ నారాయణ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’. నవీన్ ఇరగాని దర్శకుడు. తన్వీర్ ఎండీ నిర్మాత. ఈ చిత్రం టీజర్ను ఇటీవల కథానాయకుడు గోపీచంద్ విడుదల చేశారు. టీజర్ ప్రామిసింగ్గా కనిపిస్తుంది. చిత్రం జనాదరణ పొందాలని గోపీచంద్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్మనీ అనే ఈ చిత్రం ఉపశీర్షికలో ఈ చిత్ర కథాంశం వుందని, అందరిలోనూ ఆసక్తిని కలిగించే విధంగా ఈ చిత్రం వుంటుందని దర్శకుడు తెలిపారు.