సల్మాన్ ఖాన్ నటిస్తున్న రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఆయన ‘టైగర్ 3’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రాల విడుదల మరింత ఆలస్యం కానుంది. టైగర్ సిరీస్లో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఈద్ పండుగకు విడుదల కావాలి..కానీ తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళి పర్వదినాన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలాగే సల్మాన్ మరో సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా ఈ డిసెంబర్ 30న విడుదల కావాల్సింది వచ్చే ఏడాది ఈద్ పండుగకు మారింది. ఈద్ పండుగకు సల్మాన్ తన కొత్త సినిమాలను విడుదల చేయడం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నది. ఇలా ఈద్కు సినిమాలను విడుదల చేయడం సల్మాన్ సెంటిమెంట్గా చెబుతుంటారు. పాండమిక్ వల్ల ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఆలస్యమయ్యాయి. ఆ ప్రభావం సినిమాల విడుదలపైనా పడింది. అందుకే ఈ రెండు చిత్రాలు కొంత ఆలస్యంగా తెరపైకి రాబోతున్నాయి. ‘టైగర్ 3’ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా…‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రాన్ని ఫర్హాద్ సమ్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, వెంకటేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.