రామ్ కార్తీక్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసిన వాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. చిత్రీకరణ తుదిదశలో ఉంది. సోమవారం హీరో ఫస్ట్లుక్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ కథాంశమిది. హాస్య ప్రధానంగా ఆకట్టుకుంటుంది. నాయకానాయికల పాత్ర చిత్రణ కొత్తపంథాలో సాగుతుంది. రొటీన్ ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా అందరిని అలరిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పారు. నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజయ్ వి నాగ్, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి.