‘నాలోని అభినయప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నది’ అని చెప్పింది మేఘా ఆకాష్. ఆమె కథానాయికగా అరుణ్ అదిత్ , అర్జున్ సోమయాజుల సరసన నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్రెడ్డి దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు. అరుణ్ అదిత్ మట్లాడుతూ ‘సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. థియేటర్లకు వెళ్లి చూశాం. ప్రేక్షకులు ఎమోషనల్గా ఫీలవుతున్నారు. కొందరు ఫోన్లు చేసి ైక్లెమాక్స్ అలా ఎందుకు తీశారని అడుగుతున్నారు. త్వరలో వరంగల్, కరీంనగర్ టూర్కు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. తాను తెలుగులో నటించిన తొలి చిత్రానికి మంచి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని అర్జున్ సోమయాజుల చెప్పారు.