హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2: ఇటీవల జరిగిన ఓ యథార్థ సంఘటనే ‘అసలేమైంది’ సినిమా అని ఆ చిత్ర నిర్మాత ఆర్యన్ రమేశ్ తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని శ్రేయ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆర్యన్మాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్-2 ద్వారా ఈ చిత్రాన్ని తీస్తున్నామని, కొంతభాగం షూటింగ్ పూర్తయిందని ఇంకా మిగిలిన సన్నివేశాలను వరంగల్లో షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు.
చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్పై పాటను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో ఆదిత్య ఓం, సోనికాగౌడ్, ఆర్యన్ రమేశ్, ఈషా హిందోచా, అదితిసింగ్ నటిస్తున్నట్లు తెలిపారు. చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. అసలేమైంది సినిమాకు దర్శకుడు అరుణ్కుమార్, నిర్మాతగా ఆర్యన్ రమేశ్, సంగీత దర్శకుడిగా మహావీర్ వ్యవహరిస్తున్నారు.