Chinmayi | స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. భారత దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకుగాను ఆమెపై హెచ్సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్మపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా?, ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా.. అందరూ ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో అన్నపూర్ణమ్మపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన విషయం తెలిసిందే.
అయితే భారత దేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టుపిడ్ కంట్రీ అన్నారని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.