మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో వెంటనే అపస్మారక స్థితికి వెళ్లారు. ప్రస్తుతం అతనికి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.
సాయి తేజ్ ఆరోగ్యంపై పలువురు పలు రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని వెబ్ సైట్స్, మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు. హట్సాఫ్ తమ్ముడు..హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్..నీ యాక్సిడెంట్ వంకతో …. తప్పుడు వార్తలు అమ్ముకొని ..తికేస్తున్న అందరు బాగుండాలి ..వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను అంటూ తన ట్వీట్లో పేర్కోన్నారు.
మంచు లక్ష్మీ, శ్రీకాంత్, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కూడా సాయి తేజ్పై తప్పుడు ప్రచారాలు చేయోద్దని కోరారు. నిరక్ష్యం వలన జరిగిన ప్రమాదం కాదని, కేవలం ఇసుక వలన స్కిడ్ అయి కింద పడ్డాడని అంటున్నారు.