ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అనే చెప్పాలి.ఇప్పుడు ఆమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంటుంది. ఒక తెలుగే కాదు, తమిళం, హిందీ భాషలలోను పని చేస్తుంది. అయితేఇప్పుడు పూజా హెగ్డే ఎంత బిజీగా ఉందో దర్శకుడు హరీష్ శంకర్ తెలియజేశాడు.
మన అందరికీ లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫంక్షన్కి కూడా వస్తుందో రాదో అనుకున్నాను. అందరి హీరోలతో నటిస్తున్న పూజా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా చేస్తుందంటూ హింట్ ఇచ్చాడు హరీష్ శంకర్. అంటే “భవదీయుడు భగత్ సింగ్” చిత్రంలో పవన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయినట్టే. ఈ సినేమానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.