తేజ సజ్జా హీరోగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్’. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏపీలోని మారేడుమిల్లి, పాడేరులో జరుగుతున్నది. తేజ సజ్జాకు దర్శకుడు సీన్ వివరిస్తున్న వర్కింగ్ స్టిల్ను చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘సూపర్ హీరో కథాంశంతో తెలుగులో రూపొందుతున్న తొలి చిత్రమిది. హనుమాన్ ఎవరు? అతడి పోరాటం ఎందుకోసమన్నది ఉత్కంఠను పంచుతుంది. యాక్షన్ సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయి. మారేడుమిల్లి, పాడేరులో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను, పాటలను చిత్రీకరిస్తున్నాం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.