Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్వైడ్గా రూ.275 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ.300 కోట్ల క్లబ్లోకి దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ‘జై హనుమాన్’ సినిమా రానుంది.
అయితే ‘హనుమాన్’ విజయం అనంతరం ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. తన తదుపరి ప్రాజెక్ట్లకు రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు..ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాణ సంస్థలు రెడీ ఉన్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘హను-మాన్’ బ్లాక్ బస్టర్ అయిన అనంతరం నాకు రూ.100, 200 కోట్ల బడ్జెట్తో పాటు రూ. 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. హను-మాన్ మూవీ చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. ఇండియన్ కల్చర్, ఇతిహాసాలతో సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే సినిమాకు బడ్జెట్ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. అలాగే నిర్మాత మొదట చెప్పిన బడ్జెట్లో నేను సినిమా తీయలేను. ఎందుకంటే అప్పుడప్పుడు బడ్జెట్ ఎక్కువ కూడా అవ్వొచ్చు. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను అంటూ ప్రశాంత్ తెలిపాడు.
ఇక ‘హనుమాన్’కు సీక్వెల్గా వస్తున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.