Hanuman | తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ (Hanuman) సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ వారాంతాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లు రాబడుతున్నది. దీంతో విడుదలైన 25 రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన మొదటి సినిమాగా నిలిచింది. దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హనుమాన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థకావట్లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఎంతోమంది వారి హృదయాల్లో స్థానం కల్పించారని, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీని వీక్షిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు తక్కువగా ఉన్నప్పటికీ హిట్టాక్ రావడంతో క్రమంగా స్క్రీన్ల సంక్ష పెంచుకున్నది. మూడు వారాలు ముగిసినప్పటికీ ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తునే ఉన్నారు. దీంతో సంక్రాంతి సీజన్లో రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 92 ఏండ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్టైమ్ సంక్రాతి బ్లాబస్టర్గా రికార్డు సృష్టించింది.