టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ (Satyadev), తమన్నా (Tamannah) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ గుర్తుందా శీతాకాలం (Gurthunda Seetakalam). తాజాగా మేకర్స్ మూవీ లవర్స్ కోసం ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ అందించారు. ఈ సినిమా నుంచి రెండో పాట సుహాసినిని రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ పాటను లక్ష్మి భూపాల్ రాశాడు.
సత్యదేవ్, తమన్నా, కావ్యశెట్టి, మేఘా ఆకాశ్ మధ్య ఈ సాంగ్ వస్తుందని సాంగ్ అప్డేట్ పోస్టర్ ద్వారా తెలియజేస్తున్నారు మేకర్స్. గుర్తుందా శీతాకాలం కన్నడలో సూపర్ హిట్గా నిలిచిన లవ్ మాక్టెయిల్ చిత్రానికి తెలుగు రీమేక్గా వస్తుంది. ఈ చిత్రాన్ని నాగశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా.. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో సుహాసినీ మణిరత్నం కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్ మెంట్స్ శ్రీ వేదాక్షర మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గుర్తుందా శీతాకాలం టైటిల్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
గుర్తుందా శీతాకాలం రెండో పాట అప్డేట్..
Breeze yourselves with the Melodious 2nd Single #Suhasini from #GurtundhaSeetaKalam 💕
Tomorrow at 12pm 🎧@ActorSatyaDev @tamannaahspeaks @nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @priyadarshi_i @LakshmiBhupal#GurtundaSeetakalamOnDec9th pic.twitter.com/NFSBp9CkkV
— BA Raju's Team (@baraju_SuperHit) November 27, 2022
గుర్తుందా శీతాకాలం టైటిల్ ట్రాక్..