Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే ఈ విడుదలకు ముందు లేడి ఫ్యాన్స్కు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సాలిడ్ గుడ్ న్యూస్ అందించింది.
ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు కారం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే లేడి ఫ్యాన్స్ కోసం మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. విజయవాడ గాంధీనగర్లోని రాజ్ థియేటర్లో గుంటూరు కారం జనవరి 12న స్పెషల్ స్క్రీనింగ్ ఉండబోతుంది. ఇది కేవళం మహిళలకు మాత్రమే. మహేష్ లేడీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ నమ్రత ఇన్స్టాలో రాసుకోచ్చింది.