Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి..’ పాట పర్ఫెక్ట్ మాస్ నంబర్గా ఆకట్టుకుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో మీనాక్షి చౌదరి లంగావోణీలో ఉండగా.. మహేష్ భుజంపై చేతులు వేసి క్యూట్ లుక్లో కనిపిస్తుంది.
Finally! 🤩
Amidst the spiciest moments, get ready for some crazy ones too 😉
Brace yourself to be awestruck in 𝟖 𝐃𝐚𝐲𝐬 ! ❤️🔥#GunturKaaram 😎
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash… pic.twitter.com/yeHfgc4Vwk
— Guntur Kaaram (@GunturKaaram) January 4, 2024
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.