Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్తో పాటు, కుర్చీ మడత పెట్టి, ధమ్ మసాలా, ఓహ్ మై బేబీ, సాంగ్స్ విడుదల చేయగా.. యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతున్నాయి.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. మావా ఎంతైనా.. అంటూ ఈ పాట ఉండగా.. మిర్చి యార్డ్లో ఈ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సాంగ్లో మహేష్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ, రమణా చారి కలిసి ఆలపించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.