Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రోమో చూస్తే.. మహేశ్బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. టైటిల్కు తగ్గట్టుగానే ఘాటెక్కిస్తూ.. ఈ పాట సినిమాకే హైలెట్గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ పాట ఇంత రేంజ్లో సక్సెస్ అవ్వడానికి కారణం కుర్చీ తాత.
కుర్చీ తాత సరదాకి ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ డైలాగ్ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా ఒక పాటనే రాశాడు. అయితే తన డైలాగ్ను గుంటూరు కారం సాంగ్లో పెట్టడంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు.
గుంటూరు కారం (Guntur kaaram)లో నా డైలాగ్తో రాసిన పాటను మహేశ్బాబు పాడి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ లు పాట రూపంలో చేసి డాన్స్ చేయడం సంతోషంగా అనిపించింది. నేను అభిమానులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్న జనవరి 12 నాడు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా విడుదలకు రెండు వారలు టైం ఉంది. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మహేష్ బాబుతో ఆ పాటలో ఒక్క చరణానికి అన్న డ్యాన్స్ చేస్తా అంటూ కుర్చీ తాత చెప్పుకోచ్చాడు.
Kurchimadathapettina taatha reaction for #Kurchimadathapetti song from #GunturKaaram#GunturKaaramOnJan12th #Maheshbabu pic.twitter.com/CaMkSBIjIY
— TarunKumar (@mr__btk) December 29, 2023