ముంబై : (Farooq Jaffer) బిగ్ బీ బేగంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరూక్ జాఫర్ (89) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫరూక్ జాఫర్ను స్థానిక సహారా దవాఖానలో చేర్చి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయిందని ఆమె పెద్ద కుమార్తె మెహ్రు జాఫర్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో మరణించినట్లు ఆమె మనవడు షాజ్ అహ్మద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. శనివారం ఐష్బాగ్లోని శ్మశానవాటికలో దహనసంస్కారాలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్సీ ఎస్ఎం జాఫర్ సతీమణి నటి ఫరూక్ జాఫర్ శుక్రవారం రాత్రి 7 గంటలకు కన్నుమూశారు అని ట్విట్టర్లో మనవడు రాశాడు.
‘గులాబో సీతాబో’ లో అమితాబ్ బచ్చన్ భార్యగా ఫరూక్ జాఫర్ నటించి మన్ననలు అందుకున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా ప్రధాన పాత్రలో కనిపించాడు. గులాబో సీతాబోకి ముందు షారూఖ్ ఖాన్తో కలిసి స్వదేశ్, రేఖతో కలిసి ఉమ్రావ్ జాన్ సినిమాలో కూడా నటించారు. కాగా, ఫరూఖ్ జాఫర్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఆమె మరణం పట్ల తమ బాధను వ్యక్తం చేశారు.
చిన్నారులు అభిమానించే వాల్ట్ డిస్నీ ప్రారంభం
ఇది ఫేస్బుక్ రహస్య బ్లాక్లిస్ట్.. బహిర్గతం చేసిన ఓ వెబ్సైట్
దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..