నోయల్ సీన్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధన్రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఈఎంఐ, ఈ అమ్మాయి’. ఈ చిత్రాన్ని బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై డి.రమేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. దొంతు రమేష్ దర్శకుడు. ఈ నెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నోయల్ మాట్లాడుతూ…‘దర్శకుడు చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. అమ్మాయిలు తమ జీవితాల్లో వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే సమస్యల నేపథ్యంతో సినిమా సాగుతుంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మోహన్ చంద్, సంగీతం : రవిశంకర్.