Gopichand : గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న 31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఏ.హర్ష రూపొందిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ…‘మా సంస్థలో నిర్మిస్తున్న 14వ చిత్రమిది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం.
కన్నడలో మంచి విజయాలు సాధించిన దర్శకుడు హర్షతో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తాం. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : స్వామి జే, సంగీతం : రవి బస్రూర్.