గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. నేడు గోపీచంద్ జన్మదినం ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. గోపీచంద్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ ైస్టెలిష్గా ఉంటుంది. పక్కా కమర్షియల్ అంశాల కలబోతగా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కరమ్చావ్ల, సంగీతం: జకేస్ బీజాయ్.