గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఎ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ జీప్ బానెట్పై కూర్చుని, గూండాలను తాళ్లతో కట్టి లాగుతూ, డాషింగ్ పోలీస్ ఆఫీసర్గా గోపీచంద్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.
అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బంధాలు, భావోద్వేగాలతోపాటు మసాలా అంశాలు కూడా మెండుగా ఉంటాయని, గోపీచంద్ కెరీర్లోనే ఇది హైబడ్జెట్ మూవీ అనీ దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అజ్జు మహంకాళి, కెమెరా: స్వామి జె.గౌడ్, సంగీతం: రవి బన్రూర్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.