గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్నది. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల గురించి బుధవారం ప్రకటన చేసింది చిత్ర బృందం. మే 20న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. కరోనా కరుణిస్తే అని షరతు పెట్టింది. పరిస్థితులు మెరుగుపడితే ఈ తేదీనే విడుదల చేస్తామని నిర్ణయించారు. ఇటీవల దివంగత పాటల రచయిత సీతారామశాస్త్రి రచించిన పూజలు, పునస్కారాలు, నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం చెబుతోంది.