శ్రద్దాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘అర్థం’. మణికాంత్ దర్శకుడు. రాధికా శ్రీనివాస్, మినర్వా సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘యాలో ఈ గుబులే ఏలో..’ అనే సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ పాట విలేజ్లో వుండే హీరో గుండెలో అతని ప్రేమికురాలు రేపిన అలజడులను వర్ణిస్తూ.. మాస్ పదాలతో క్లాస్ సాంగ్లా వుంటుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, సుచిత్ర చంద్రబోస్ నృత్యం ఈ పాటను ఉన్నత స్థానంలో నిలిపాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’ అన్నారు. సాహితీ అవాంఛ, సాయిధీన, నందిత దురైరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: రిత్విక్ వెట్సా.