టాలీవుడ్ (Tollywood) యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండో షెడ్యూల్ ఇటీవలే ఊటీలో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి సహా పలువురు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మోహన్ రాజా అండ్ టీం హైదరాబాద్ కు రాగానే మ్యూజిక్ సెషన్స్ ను మొదలుపెట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశాడు.
మోహన్రాజా, సినిమాటోగ్రఫర్ నీరవ్ షాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ప్రధాన పాత్రల్లో నటించే యాక్టర్లు ఎవరనే దానిపై మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మలయాళం పొలిటికల్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది గాడ్ ఫాదర్. రాంచరణ్, ఎన్వీప్రసాద్, ఆర్ బీ చౌదరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చిరంజీవి మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న ఆచార్య దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఆచార్యలో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా..కాజల్ , పూజాహెగ్డే ఫీమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. దీంతోపాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, బాబీ దర్శకత్వంలో మరో సినిమాలో లైన్ లో ఉంది.
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి