టాలీవుడ్ యాక్టర్ కార్తికేయ హీరోగా వచ్చిన చిత్రం చావు కబురు చల్లగా. గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో లావణ్యత్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తర్వాత సరైన హిట్ లేని కార్తికేయ ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నా..ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందీ చిత్రం. చావు కబురు చల్లగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో..తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు కార్తికేయ.
ఈ మేరకు ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. చావు కబురు చల్లగా నాలో ఉన్న కొత్త నటుడికి బయటకు తీసుకొ్చింది. చాలా మంది హృదయాలకు నన్ను దగ్గర చేసింది. మీరు సందేశాలను చదువుతున్నపుడు బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు చాలా గర్వంగా అనిపించింది. సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు మరోసారి నాకు అవకాశం ఇవ్వాలి. తప్పులను సరిదిద్దుకొని..ఇలా జరుగుకుండా చూసుకుంటా అంటూ తన సందేశంలో పేర్కొన్నాడు కార్తికేయ.