Allu Aravind | దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది. దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. టాలీవుడ్లో సక్సెస్ రేటు అత్యధికంగా ఉన్న నిర్మాణ సంస్థలలో ఇది కూడా ఒకటి. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే భావన ప్రేక్షకులలో ఉంది. కాగా తాజాగా ఈ సంస్థలో తెరకెక్కబోయే సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతుంది. లేటెస్ట్ గా అల్లు అరవింద్ ఈ బ్యానర్ లో రూపొందబోయే సినిమాలను ప్రకటించాడు.
మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకుడుగా ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు అల్లు అరవింద్ తెలిపాడు. బాలయ్యతో సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. ఇక ఏజెంట్ తో విమర్శల పాలైన సరేందర్ రెడ్డితో ఓ సినిమాను చేయబోతున్నట్లు వెల్లడించాడు. ధృవ టైమ్ లోనే అరవింద్.. సురేందర్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చాడని సమాచారం. అన్ని కుదరితే అల్లు అర్జున్ తోనే సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక యంగ్ డైరెక్టర్ చందూ ముండేటితో ఏకంగా మూడు సినిమాలను చేయబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించాడు. అందులో ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ సినిమా కూడా ఉండనుందట. తమిళ హీరో సూర్య ఈ ఆ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనితో పాటుగా నాగచైతన్యతో ఒకటి, హిందీ నటుడు కార్తిక్ ఆర్యన్ తో ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం.
వీటితో పాటుగా బాలయ్యతో ఓ హై బడ్జెట్ సినిమా చేయబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించాడు. ఇక గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా ఉంబోతుందని తెలుస్తుంది. కన్ఫార్మ్ అయిందని చెప్పలేం కానీ దర్శకుడి వేటలో అల్లు అరవింద్ ఉన్నాడట. ఇక తమిళ దర్శకుడు మురుగుదాస్ కూడా గీతా ఆర్ట్స్ లైనప్ లో ఉన్నాడు. గజనీ టైమ్ లోనే అల్లు అరవింద్.. మురుగుదాస్ కు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. పలు కారణాల వల్ల ఈ కాంబోలో సినిమా సెట్ కాలేదు. అయితే అరవింద్ మాత్రం మురుగుదాస్ తో గట్టిగానే ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా గజనీ-2 అని టాక్. ఇప్పటికే అరవింద్ సీక్వెల్ కోసం పలు సార్లు అమీర్ ను కలిశాడట. కాగా గజనీ సినిమాను తెలుగు అల్లు అరవింద్ విడుదల చేశాడు.