Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 11న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఎంవీవీ సినిమాస్ బ్యానర్తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.
#GeetanjaliMalliVachindhi coming to theatres on Thursday, 11th April. pic.twitter.com/nJZclMOaxH
— Aakashavaani (@TheAakashavaani) February 27, 2024