ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్రాజ్ నిర్మాత. ఈ నెల 22న తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఇన్టెన్స్ ఎమోషనల్ డ్రామా ఇది. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా నూతనత్వంతో నిండి వుంటుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.