ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఒక క్రైమ్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో చిత్రశుక్ల లాయర్ పాత్రలో నటిస్తున్నది. శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వెంకట్ హనుమ, సంగీతం : గోపీ సుందర్.