ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘గీతా సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్రాజ్ నిర్మాత. గురువారం ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.
‘పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా’ అంటూ టీజర్లో ఆదర్శ్ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. వాస్తవిక సంఘటనలకు కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్నాం. టీజర్తో ప్రేక్షకులకు చిత్రంపై క్యూరియాసిటి పెరిగింది. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే చిత్రం కొత్త అనుభూతిని కలిగిస్తుంది’ అన్నారు.