Gayathri Bhardwaj | రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది గాయత్రి భరద్వాజ్. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ విజేతగా నిలిచిన గాయత్రి.. తర్వాత దిన్దొర తో పాటు మరో రెండు వెబ్ సిరిస్ లు చేసింది. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.
తాజాగాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలుగులో తన ఫేవరేట్ హీరో గురించి మనసులో మాట పంచుకుంది గాయత్రి. రామ్ చరణ్ అంటే గాయత్రికి పిచ్చి ఇష్టమట. ”తెలుగులో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం, చరణ్ కి క్రేజీ ఫ్యాన్ ని. ఆయన అంటే క్రష్ వుంది (నవ్వుతూ) ఆర్ఆర్ఆర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. చరణ్ తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది గాయత్రి.
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చెబుతూ.. ఇందులో తను టామ్ బాయ్ తరహా పాత్ర చేసిందట. టైగర్ లో ఎవరూ ఊహించని అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు వుంటాయని, రవితేజ ఇలాంటి యాక్షన్ సినిమాని గతంలో ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది గాయత్రి. ‘టైగర్ నాగేశ్వరరావు ఈనెల 20 విడుదల కానుంది.