సెన్సిబుల్ చిత్రాల మేకర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అగ్ర దర్శకుడు గౌతమ్మీనన్. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు తన అభిరుచి మేరకు తెరపై కనిపిస్తుంటారు. ‘సీతారామం’ చిత్రంలో ఆయన మేజర్ సెల్వన్ పాత్రను పోషించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. మేజర్ సెల్వన్గా గౌతమ్మీనన్ ఫస్ట్లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘నటీనటుల పరిచయ వీడియోలకు మంచి స్పందన లభిస్తున్నది. యుద్ధం నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. 1965 బ్యాక్డ్రాప్లో నడుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందుతున్నది.