కరోనా కాలంలో లేచిన దగ్గర నుండి పడుకునే వరకు విషాద వార్తలు వింటూనే ఉన్నాం. కొందరు కరోనా మరణిస్తుంటే మరి కొందరు అనారోగ్యంతో తుది శ్వాస విడుస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండడం అభిమానులని కలవరపరుస్తుంది. తాజాగా టాలీవుడ్ కమెడీయన్ గౌతంరాజు సోదరుడు సిద్దార్థ కరోనాతో కన్నుమూసారు.
సిద్దార్థ కరోనాతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సిద్దార్దకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరుడి మృతి విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసిన గౌతం రాజు.. బయట పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని, అంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, గౌతం రాజు తెలుగు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.