లక్ష్, వేదిక దత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 24న విడుదల కానున్నది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు.ఎ సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ హీరోలు నటించిన సంస్థ మాది. ప్రస్తుతం దాదాపు పదిహేను చిత్రాలను నిర్మిస్తున్నాం. ఇవన్నీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ ఇచ్చారు. హీరోయిన్ పాత్ర ఆకట్టుకుంటుంది. ముగింపు సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేస్తున్నాం’అన్నారు.