ఈజీ మూవీస్ పతాకంపై దర్శకుడు వారణాసి సూర్య రూపొందిస్తున్న సినిమా ‘గండ’. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గీత రచయిత శివశక్తి దత్తా అతిథిగా హాజరై టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘సినిమాకు డబ్బే ప్రధానం కాదని ఈ చిత్రంతో దర్శకుడు సూర్య నిరూపిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇది మరెందరికో స్ఫూర్తినివ్వాలి’ అన్నారు. దర్శకుడు వారణాసి సూర్య మాట్లాడుతూ…‘అంతా కొత్త వాళ్లతో కంటెంట్ నమ్ముకుని సినిమా రూపొందించాం. జీరో బడ్జెట్ మూవీ చేయొచ్చని చెప్పిన రామ్గోపాల్ వర్మ నాకు స్ఫూర్తి. ఐదేండ్లుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.